Saturday, February 10, 2018

మకుటము

పద్యాలలో వేరొక కవుల మకుటము వాడుకొనుట ఎంత వరకు సమంజసము? ప్రతీ కవి యొక్క కవనము, అవి తన మానసమును ప్రతిబింబించునని నా అభిప్రాయము. ఆ కవిత్వములలో తన రూపమును ఆవిష్కరించవచ్చు. మరి తదుపరి తరములకు ఆ మకటము వేరే వారు వాడుటవల్ల ఆ పద్య కర్త తెలియక ఆ భావన మారునుకదా? కాదంటారా? వేమన గారివి కూడా చాలా వరకు వేరే పద్యములు కలిసినవి అని వింటిని.
**********************************
కం. మకుటము నుంచుచు మనసును
బ్రకటింతురు గవులెపుడును బాండిత్యమునన్
వికటించును విశ్వమది, మ
మకారము దెలిపిన బద్యమందు నది పరుల్!
**********************************

No comments:

Post a Comment